కూర తియ్యగా ఉందేంటన్న భర్త.. పంచదార వేశానన్న భార్య.. ఇదేంటని నిలదీసిన ఆ భర్త పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2021-09-07T21:01:17+05:30 IST

`కూర తియ్యగా ఉంది.. అన్నం తినను` అన్న పాపానికి ఆ భర్త తల పగిలిపోయింది..

కూర తియ్యగా ఉందేంటన్న భర్త.. పంచదార వేశానన్న భార్య.. ఇదేంటని నిలదీసిన ఆ భర్త పరిస్థితి ఏంటంటే..

`కూర తియ్యగా ఉంది.. అన్నం తినను` అన్న పాపానికి ఆ భర్త తల పగిలిపోయింది.. తీవ్రంగా రక్తస్రావం కావడంతో హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది.. హర్యానాలోని హిసార్ జిల్లాలో బర్వాలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. బర్వాలాకు చెందిన దినేష్ కుమార్ ఆయుర్వేద వైద్యుడిగా పనిచేస్తున్నారు. అతను 2011లో బిందియా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె మానసిక వ్యాధిగ్రస్తురాలు అనే విషయం దినేష్‌కు పెళ్లి జరిగిన తర్వాత తెలిసింది. అప్పుడిక చేసేదేం లేక భార్యకు చికిత్స చేయించాడు. 

ఇవి కూడా చదవండి

భార్యను అన్న కుటుంబం వద్ద ఉంచి.. ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లిన తమ్ముడు.. ఆ తర్వాత మూడు హత్యలు ఎందుకు జరిగాయంటే..

దూసుకొస్తున్న గూడ్స్ రైలు.. పట్టాలపై మత్తులో తూలుతున్న ఇద్దరు యువకులు.. చివరకు ఏం జరిగిందంటే..


గత ఆదివారం రాత్రి భోజన సమయంలో బిందియా తను తయారు చేసిన కూరను దినేష్‌కు వడ్డించింది. ఆ కూర తియ్యగా ఉండడంతో దినేష్ ప్రశ్నించాడు. కూరలో పంచదార వేశానని ఆమె బదులిచ్చింది. దీంతో ఆగ్రహం చెందిన దినేష్ భోజనం చేయనని చెప్పి లేవబోయాడు. తను చేసిన కూర రుచి బాగోలేదన్నాడనే కోపంతో బిందియా ఓ ఇనుప రాడ్డు తీసుకుని దినేష్ తలపై బలంగా కొట్టింది. దీంతో దినేష్ గట్టిగా అరుస్తూ కుప్పకూలిపోయాడు. అతడి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకున్న అనంతరం దినేష్ తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  




Updated Date - 2021-09-07T21:01:17+05:30 IST