ఫేస్‌బుక్‌లో ఓ మహిళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడా కుర్రాడు.. నాలుగు రోజుల తర్వాత జరిగిందో ఘోరం..!

ABN , First Publish Date - 2021-08-08T01:35:01+05:30 IST

ఒక మహిళకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడా కుర్రాడు. అలా పంపడమే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. ఫ్రెండ్ షిప్ డే రోజున అతను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడంతో నలుగురు యువకులు అతన్ని చావబాదారు.

ఫేస్‌బుక్‌లో ఓ మహిళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడా కుర్రాడు.. నాలుగు రోజుల తర్వాత జరిగిందో ఘోరం..!

ఇంటర్నెట్ డెస్క్: ఒక మహిళకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడా కుర్రాడు. అలా పంపడమే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. ఫ్రెండ్ షిప్ డే రోజున అతను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడంతో నలుగురు యువకులు అతన్ని చావబాదారు. ఆ తర్వాత నాలుగు రోజులకు ఆ యువకులు మరింత తెగించారు. చివరకు కత్తితో సదరు కుర్రాడిని పొడిచి చంపేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగు చూసింది. స్థానికంగా నివసించే ఒక కుర్రాడు.. ఫ్రెండ్‌షిప్ డే రోజున ఒక యువతికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఈ విషయం తెలిసిన సదరు యువతి మిత్రులు నలుగురు వచ్చి ఆ కుర్రాడిని చావబాదారు.


ఇది జరిగిన సరిగ్గా నాలుగు రోజులకు ఆ యువకులు మళ్లీ సదరు కుర్రాడిని టార్గెట్ చేశారు. అతన్ని చుట్టుముట్టి తీవ్రంగా కొట్టారు. వారిలో ఒకడు కత్తి తీసి కుర్రాడిని పొడిచేశాడు. గిలగిల్లాడి అతను చనిపోగానే శవాన్ని పక్కనే ఉన్న పొదల్లో పడేసి పారిపోయారు. మృతదేహాన్ని చూసిన కొందరి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సీసీకెమెరా ఫుటేజిలు పరిశీలించి ఇప్పటి వరకూ ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఈ హత్య కేసులో ఎవరి హస్తమైనా ఉందా? అని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-08T01:35:01+05:30 IST