లాక్‌డౌన్‌ తర్వాతే కరోనా పెరిగింది

ABN , First Publish Date - 2020-05-22T10:19:38+05:30 IST

లాక్‌డౌన్‌ తర్వా త తెలంగాణలో కరోనా వైరస్‌ వేగంగా పెరిగిందని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి

లాక్‌డౌన్‌ తర్వాతే కరోనా పెరిగింది

వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే తరపైకి పోతిరెడ్డి పాడు అంశం

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి


జగిత్యాల, మే 21(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ తర్వా త తెలంగాణలో కరోనా వైరస్‌ వేగంగా పెరిగిందని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. కేసులు పెరగడంతో ప్ర భుత్వం టెస్ట్‌లు చేయడమే మానేసిందని అన్నా రు. జగిత్యాలలోని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజల ను మభ్యపెట్టడంలో కేసీఆర్‌ నిష్ణాతుడని అన్నారు. కరోనా మీద కాంగ్రెస్‌ పార్టీ మాట్లాడితే హేళన చేశారకని, చెప్పిన అబద్దం చెప్పకుండా మాటలు మా ట్లాడతున్నారని అన్నారు.


కరోనా పాజిటివ్‌తో చనిపో తే నివేదికల్లో చూపడం లేదన్నారు. తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే పోతిరెడ్డిపాడు అంశం తెరపైకి తెచ్చారన్నారు. పెట్టుబడి లేకుండా విద్యు త్‌ ఉత్పత్తి చేసే సంస్థలను అమ్మాలని చూస్తున్నారన్నారు. జీవన్‌ రెడ్డి నిబద్దత కలిగిన నాయకుడని, తాను కూడా అభిమానినేనన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు విషయంలో ఎం దుకు జగన్‌కు సహకరిస్తున్నారో ప్రజలకు తెలుసు అన్నారు. జగన్‌ గెలుపునకు పెట్టుబడి పెట్టింది కేసీ ఆర్‌ కాదా..? అని ప్రశ్నించిన జీవన్‌రెడ్డి, ఎవరి చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు తెలుసన్నా

Updated Date - 2020-05-22T10:19:38+05:30 IST