యుగ పురుషుడు ఎన్టీఆర్
ABN , First Publish Date - 2022-01-19T05:33:27+05:30 IST
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు యుగ పురుషుడని, తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహా నేత అని మాజీ మంత్రి, ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు అన్నారు.
వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన టీడీపీ నేతలు
పార్టీ కార్యాలయంలో రక్తదానం చేసిన నాయకులు
మహారాణిపేట, జనవరి 18: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు యుగ పురుషుడని, తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహా నేత అని మాజీ మంత్రి, ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా బీచ్ రోడ్డు, పార్టీ కార్యాలయంలోనూ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలే అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉందని, పార్టీకి అత్యున్నతమైన కమిటీ ఉందని ఆ కమిటీకి అనుగుణంగానే ముందుకు వెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు దువ్వారపు రామారావు, పార్టీ నేతలు గండి బాబ్జీ, సీహెచ్వీ పట్టాభిరామ్, పాశర్ల ప్రసాద్, లొడగల కృష్ణ, పుచ్చా విజయ్కుమార్, బొట్టా పరదేశియాదవ్, నక్కా కనకరాజు, సీఎం రమణ, గనగళ్ళ సత్య, ఈతలపాక సుజాత, కోనేటి సురేష్, జిల్లా స్థాయి నేతలు, వార్డు పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.