కన్నకూతురిపై అఘాయిత్యం

ABN , First Publish Date - 2021-04-19T05:37:34+05:30 IST

వావివరసలు మరిచి కంటి పాపనే కాటేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ దుర్మార్గుడు పేగుబంధం సైతం మరిచిపోయాడు. రక్షణగా ఉండా ల్సిందిపోయి.. తాత్కాలిక సుఖం కోసం విర్రవిగాడు. బంధాలను అప హాస్యం చేశాడు. ముక్కుపచ్చలా రని చిన్నారిపై అఘాయిత్యానికి

కన్నకూతురిపై అఘాయిత్యం

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కసాయితండ్రి

సోన్‌ మండలంలో వెలుగులోకి వచ్చిన వైనం

సోన్‌, ఏప్రిల్‌ 18: వావివరసలు మరిచి కంటి పాపనే కాటేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ దుర్మార్గుడు పేగుబంధం సైతం మరిచిపోయాడు. రక్షణగా ఉండా ల్సిందిపోయి.. తాత్కాలిక సుఖం కోసం విర్రవిగాడు. బంధాలను అప హాస్యం చేశాడు. ముక్కుపచ్చలా రని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి మానవత్వాన్ని సిగ్గు పడేలా చేసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారిపై కన్న తండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎస్సై ఆసీఫ్‌, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం చిన్నారిని తన సొంత ఇంట్లో ఉంచి తల్లి బట్టలు శుభ్రం చేయడానికి ఇంటి పక్కన గల కాలువ వద్దకు వెళ్లింది. అప్పటికే చిన్నారి తండ్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో చిన్నారిపై అత్యాచారం చేయడంతో చిన్నారి కేకలు వేసింది. అంతలోనే తల్లి ఇంటికి రావడంతో నిందితుడు పరారయ్యాడు. విషయం గురించి తల్లి గ్రామస్థులకు తెలియజేయడంతో చిన్నారిని వైద్య చికిత్సల నిమిత్తం నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆదివారం చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కేసు విచారణ చేపట్టినట్లు ఎస్సై ఆసీఫ్‌ తెలిపారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై వివరించారు.

Updated Date - 2021-04-19T05:37:34+05:30 IST