హెల్త్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలి
ABN , First Publish Date - 2020-12-04T05:57:40+05:30 IST
జీవీఎంసీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఐదు నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
మహా ధర్నాలో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకుల డిమాండ్
సిరిపురం, డిసెంబరు 3: జీవీఎంసీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఐదు నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి, అధ్యక్షుడు జి.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి ఎంవీ ప్రసాదరావులు మాట్లాడుతూ హెల్త్ అలవెన్స్ బకాయిలు ఆపివేసిన కార్మికుల స్థానంలో వారి పిల్లలను పనిలో పెట్టాలన్నారు. మలేరియా, నీటి సరఫరా, యూజీడీ డ్రైవర్లకు హెల్త్ అలవెన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ అమలు, ఇంజనీరింగ్, మలేరియా డ్రైవర్లకు హెల్త్ అలవెన్స్ అమలు కోసం డీఎంఏకి, ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలను వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టి.నూకరాజు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.