కాయతొలుచు పురుగు నివారణకు అగ్నిఅస్త్రం
ABN , First Publish Date - 2021-10-24T05:00:38+05:30 IST
కాయతొలు చు పురుగు నివారణకు అగ్నిఅస్త్రం పిచికారీ చే యాలని ప్రకృతి వ్యవసా య మాస్టర్ ట్రైనర్లు మ స్తాన్, రామ్మో హన్రెడ్డి సూచించారు.
పులివెందుల రూరల్, అక్టోబరు 23: కాయతొలు చు పురుగు నివారణకు అగ్నిఅస్త్రం పిచికారీ చే యాలని ప్రకృతి వ్యవసా య మాస్టర్ ట్రైనర్లు మ స్తాన్, రామ్మో హన్రెడ్డి సూచించారు. శనివారం ఉలిమెల్ల రింగురోడ్డు సమీపంలో ప్రకృతి వ్యవ సాయం ద్వారా సాగుచే స్తున్న వంగ, టమోటా తదితర పంటలను పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో టమోటా పం టకు వైరస్ సోకే అవకాశం ఉందని, వైరస్ నివారణకు పచ్చిపేడ, పసుపు ద్రావ ణం తయారుచేసి పిచికారీ చేయాలని సూచించారు.
వంగ పంటకు ఆశించిన కాయతొలుచు పురుగు నివార ణకు అగ్నిఅస్త్రం పిచికారీ చేయాలన్నారు. పొగాకు కిలో, వెల్లుల్లి పాయలు 500 గ్రాములు, పచ్చిమిర్చి 500గ్రాములు, వేప ఆకులు 5కిలోలు, ఆవుమూత్రం 10లీ టర్లతో అగ్నిఅస్త్రం తయారు చేయవచ్చన్నారు. ఈ మిశ్రమాన్ని పురుగు ఉదృతిని బట్టి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు.