అగ్నిపథ్‌ను రద్దు చేయాలని వినతి

ABN , First Publish Date - 2022-06-23T03:21:16+05:30 IST

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ను వెంటనే రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పగిడిపోగు కిరణ్‌ కిషోర్‌ కోరారు. బుధవారం ఆయన

అగ్నిపథ్‌ను రద్దు చేయాలని వినతి
తహసీల్థార్‌ ప్రసాద్‌కు వినతి పత్రాన్ని అందజేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నేతలు

వెంకటాచలం, జూన్‌ 22: కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ను వెంటనే రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పగిడిపోగు కిరణ్‌ కిషోర్‌ కోరారు. బుధవారం ఆయన ఎస్‌ఎఫ్‌ఐ నేతలతో వెళ్లి  తహసీల్దార్‌కు  వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అగ్నిపథ్‌ను వెంటనే రద్దు చేసి, పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నేత బాబ్జి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-23T03:21:16+05:30 IST