ఆర్టీఐ కింద అగ్రి సమాచారం

ABN , First Publish Date - 2021-02-27T09:48:50+05:30 IST

కేంద్ర సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం వ్యవసాయ, ఉద్యాన, సహకార, మార్కెటింగ్‌ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా అడిగితే ఇవ్వాలని ప్రభుత్వం ఆయా శాఖలను ఆదేశించింది.

ఆర్టీఐ కింద అగ్రి సమాచారం

అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం వ్యవసాయ, ఉద్యాన, సహకార, మార్కెటింగ్‌ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా అడిగితే ఇవ్వాలని ప్రభుత్వం ఆయా శాఖలను ఆదేశించింది. ఈ మేరకు ఆయా శాఖల ద్వారా ప్రజలు ఏఏ సమాచారం పొందవచ్చో తెలియజేస్తూ మ్యాన్యువల్‌ను శుక్రవారం విడుదల చేసింది. సమాచారం కోరే వ్యక్తికి రేషన్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, విద్యుత్‌, టెలిఫోన్‌, ఇంటిపన్ను, ఆస్తి పన్ను రశీదు వంటివి తప్పనిసరిగా సమర్పించాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Updated Date - 2021-02-27T09:48:50+05:30 IST