విత్తన దుకాణాల్లో తనిఖీలు
ABN , First Publish Date - 2021-06-20T05:24:22+05:30 IST
పట్టణంలోని బ్రహ్మానందరెడ్డి మునిసిపల్ కాంప్లెక్స్లోని విత్తన విక్రయ షాపులలో శనివారం వ్యవసాయ శాఖ జేడీ విజయ భారతి తనిఖీలు నిర్వహించారు.
నరసరావుపేట, జూన్ 19: పట్టణంలోని బ్రహ్మానందరెడ్డి మునిసిపల్ కాంప్లెక్స్లోని విత్తన విక్రయ షాపులలో శనివారం వ్యవసాయ శాఖ జేడీ విజయ భారతి తనిఖీలు నిర్వహించారు. మిరప విత్తన ధరల వివరాలను పరిశీలించారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన సమగ్ర పరీక్షాకేంద్రాన్ని పరిశీలించారు. మట్టి నమూనాలు, విత్తన పరీక్షలు ఈ కేంద్రంలో చేయనున్నట్లు తెలిపారు. లింగంగుంట్ల, అల్లూరివారిపాలెంలో నిర్మించిన ఆర్బీకేలను సందర్శించారు. పరీక్ష కేంద్రాన్ని, ఈ రెండు ఆర్బీకేలను జూలై 8న ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఎడీలు హేమలత, మస్తానమ్మ, ఎవో బి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.