నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-12-04T06:06:06+05:30 IST
నివర్ తుపానులో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నల్లమోతు శివరామకృష్ణ తెలిపారు.
వ్యవసాయ సలహామండలి చైర్మన్ శివరామకృష్ణ
గుంటూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నివర్ తుపానులో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నల్లమోతు శివరామకృష్ణ తెలిపారు. గుంటూరు మండల కార్యాలయం కృషి భవన్లో గురువారం జరిగిన వ్యవసాయ సలహా మండలి జిల్లా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎన్యుమరేషన్ జాప్యమైతే నష్ట తీవ్రత తగ్గుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా నష్టపోయిన రైతులందరికీ పరిహారం వచ్చే విధంగా సభ్యులు కృషి చేయాలన్నారు. సమావేశం అనంతరం కమిటీ సభ్యులు కలెక్టరు శామ్యూల్ ఆనంద్కుమార్తో భేటీ అయ్యారు. పంట నష్టపోయిన రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు.