వైసీపీ పాలన ఎక్కడా చూడలేదు...చూడబోము: ఏఐసీసీ మెంబర్
ABN , First Publish Date - 2020-05-30T18:53:50+05:30 IST
వైసీపీ పాలన ఎక్కడా చూడలేదు...చూడబోము: ఏఐసీసీ మెంబర్
అమరావతి: ముఖ్యమంత్రి అయినా తర్వాత ప్రజలకు జగన్ ఏమీ చేయలేదని ఏఐసీసీ మెంబెర్ నరహరశెట్టి వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రజాసంక్షేమ జీవం అన్న జగన్ కేంద్రం నుంచి నిధులు ఎందుకు అడగలేక పోతున్నారని ప్రశ్నించారు. సచివాలయం రంగులు విషయంలో ఐఏఎస్, డీజీపీ హైకోర్ట్కు క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీ పాలన ఎక్కడా చూడలేదు... చూడబోమని దుయ్యబట్టారు. ఏపీలో పులి, ఢిల్లీలో పిల్లి జగన్ అని నరహరశెట్టి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.