700 మంది రైతుల మరణాలకు కేంద్రానిదే బాధ్యత: Viju krishnan

ABN , First Publish Date - 2021-11-19T15:59:57+05:30 IST

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై ఎఐకెఎస్ జాతీయ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్ స్పందించారు.

700 మంది రైతుల మరణాలకు కేంద్రానిదే బాధ్యత: Viju krishnan

న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై ఎఐకెఎస్ జాతీయ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్ స్పందించారు. మూడు చట్టాలను రద్దు కోరుతూ జరిగిన ఉద్యమంలో అమరవీరులైన సుమారు ఏడు వందల మంది రైతుల మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర చట్టంపై స్పష్టం చేయాలని... దాని గురించి మోడీ మట్లాడలేదని అన్నారు. తమ డిమాండ్లలో ఎంఎస్పి చట్టం, విద్యుత్ బిల్లు ఉపసంహరణ, అలాగే రాజధాని పరివాహక ప్రాంతంలో గడ్డి కాల్చిన రైతులపై జరిమానా విధించడాన్ని ఉపసంహరణ చట్టం వెనక్కి తీసుకోవాలని తెలిపారు. కానీ... మోడీ ప్రసంగంలో ఆ డిమాండ్ల గురించి ప్రస్తావన లేదన్నారు. అయితే రైతుల ఐక్య పోరాట ఒత్తిడి మేరకే మూడు రైతు చట్టాలను రద్దు చేస్తామని మోడీ సర్కార్ అన్నారని విజూ కృష్ణన్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-19T15:59:57+05:30 IST