కనీస చార్జీలు లేకుండా బలగాలకు 50వేల సీట్లు
ABN , First Publish Date - 2020-08-15T07:51:05+05:30 IST
పంద్రాగస్టును పురస్కరించుకుని సాయుధ బలగాలకు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ‘రెడ్ పాస్’ అనే ఆఫర్ను ప్రకటించింది. భారత సైన్యం, వాయుసేన, నావికా దళం...
న్యూఢిల్లీ, ఆగస్టు 14: పంద్రాగస్టును పురస్కరించుకుని సాయుధ బలగాలకు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ‘రెడ్ పాస్’ అనే ఆఫర్ను ప్రకటించింది. భారత సైన్యం, వాయుసేన, నావికా దళం, కోస్ట్ గార్డ్, పారామిలిటరీ బలగాలకు చెందిన వారికి, శిక్షణలో ఉన్న క్యాడెట్లకు కనీస చార్జీలు లేకుండా ప్రయాణించేలా 50వేల సీట్లను కేటాయిస్తున్నట్లు తెలిపింది.