Air India: ఒమన్ నుంచి భారత్‌లోని ఈ మూడు రాష్ట్రాలకు వచ్చేవారికి కీలక సూచన!

ABN , First Publish Date - 2021-07-22T01:06:28+05:30 IST

గల్ఫ్ దేశం ఒమన్ నుంచి భారత్‌లోని కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వచ్చేవారికి నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియా తాజాగా కీలక సూచన చేసింది.

Air India: ఒమన్ నుంచి భారత్‌లోని ఈ మూడు రాష్ట్రాలకు వచ్చేవారికి కీలక సూచన!

మస్కట్: గల్ఫ్ దేశం ఒమన్ నుంచి భారత్‌లోని కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వచ్చేవారికి నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియా తాజాగా కీలక సూచన చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులు ఎవరైతే ఈ మూడు రాష్ట్రాలకు వెళ్తారో.. వారికి పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ సర్టిఫికేట్ అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నట్లు సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ప్రయాణానికి 15 రోజుల ముందు రెండో డోసు టీకా తీసుకున్నవారికి మాత్రమే ఈ మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఈ మేరకు మూడు రాష్ట్రాల పేరిట ఎయిర్ ఇండియా వేర్వేరుగా మూడు ట్వీట్స్ చేసింది. ప్రయాణికులు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నట్లు ప్రూఫ్ చూపిస్తే, వారికి పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ అవసరం లేదని స్పష్టం చేసింది.   







Updated Date - 2021-07-22T01:06:28+05:30 IST