Bengaluru: కేంద్రమంత్రి ఉన్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం

ABN , First Publish Date - 2021-09-13T14:46:33+05:30 IST

కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శోభా కరంద్లాజే ఎక్కిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది...

Bengaluru: కేంద్రమంత్రి ఉన్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం

బెంగళూరు : కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శోభా కరంద్లాజే ఎక్కిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.బెంగళూరు నుంచి బయలుదేరాల్సిన 91517 ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో దాన్ని పార్కింగ్ బేకు తరలించారు.దీంతో కేంద్రమంత్రి శోభా బెంగళూరు విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్ లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు వేచి ఉన్నారు. విమానంలోని ప్రయాణికులందరికీ కేంద్రమంత్రి శోభా వీఐపీ లాంజ్ లో ఏర్పాట్లు చేయించారు. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం కారణంగా మంత్రితోపాటు ఇతర ప్రయాణికుల కోసం మరో విమానాన్ని సిద్ధం చేశారు.


Updated Date - 2021-09-13T14:46:33+05:30 IST