అధికంగా బిడ్లను ఆకర్షించిన భారతి ఎయిర్టెల్...
ABN , First Publish Date - 2021-10-23T12:29:01+05:30 IST
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ రూ. 21 వేల కోట్ల రైట్స్కు సంబంధించి పూర్తి సబ్స్క్రిప్షన్ను పొందింది. స్టాక్ ఎక్స్ఛేంజీలు అందించిన డేటాను శుక్రవారం వెల్లడించింది.
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ రూ. 21 వేల కోట్ల రైట్స్కు సంబంధించి పూర్తి సబ్స్క్రిప్షన్ను పొందింది. స్టాక్ ఎక్స్ఛేంజీలు అందించిన డేటాను శుక్రవారం వెల్లడించింది. మొత్తం 392 మిలియన్ షేర్ల ఇష్యూ 562 మిలియన్ షేర్ల వద్ద 1.43 రెట్లు ఎక్కువ బిడ్లను ఆకర్షించగలిగింది. రైట్స్ ఇష్యూ శుక్రవారంతో ముగిసింది. గురువారం ఎయిర్టెల్ షేర్లు రూ. 697 వద్ద ముగిశాయి. రైట్స్ ఇష్యూ ధర రూ. 535కి ఫిక్స్ అయ్యింది.
అంటే చివరి ముగింపు ధర కంటే 23 శాతం తగ్గింపు. కంపెనీలో ఎయిర్టెల్ ప్రమోటర్ గ్రూప్-మిట్టల్ ఫ్యామిలీకి 56 శాతం వాటా కలిగి ఉంది. ఈ నేపధ్యంలో... ఆ కుటుంబం ఇప్పుడు రూ . 11,730 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 21 వేల కోట్లు సమీకరించాలని టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నిర్ణయించిన విషయం తెలిసిందే.