ఎయిర్టెల్ మొబైల్ రీచార్జ్.. ఇప్పుడిలా చేసుకోవచ్చు
ABN , First Publish Date - 2020-04-06T03:17:02+05:30 IST
ఎయిర్టెల్ ఖాతాదారులు తమ మొబైల్ను రీచార్జ్ చేసుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులోకి వచ్చాయి.
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ ఖాతాదారులు తమ మొబైల్ను రీచార్జ్ చేసుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత లాక్డౌన్ నేపథ్యంలో బ్యాంకు ఏటీఎంలు, ఫార్మసీలు, గ్రోసరీ స్టోర్లలో ఎయిర్టెల్ వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లను రీచార్జ్ చేసుకోవచ్చని భారతీ ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. దేశంలో చాలామందికి ఆన్లైన్లో రీచార్జ్ చేసుకునే వెసులుబాటు లేదన్న సంగతి తమకు తెలుసని అలాగే, ప్రస్తుత లాక్డౌన్ సమయంలో రీచార్జ్ చేసుకునే అవకాశం కూడా లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో పలు బ్యాంకుల ఏటీఎంలు, ఫార్మసీలు, గ్రోసరీ స్టోర్లలో రీచార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్టు తెలిపారు. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, అపోలో, బిగ్బజార్లలో రీచార్జ్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉన్నట్టు గోపాల్ విట్టల్ తెలిపారు.