ఐదేళ్లలో రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులు

ABN , First Publish Date - 2022-02-07T09:18:27+05:30 IST

టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ వచ్చే ఐదేళ్లలో వివిధ వ్యాపారాలపై రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే యోచనలో ఉంది..

ఐదేళ్లలో రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులు


న్యూఢిల్లీ: టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ వచ్చే ఐదేళ్లలో వివిధ వ్యాపారాలపై రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే యోచనలో ఉంది. తన అనుబంధ కంపెనీలైన ఇండస్‌ టవర్స్‌, ఎన్‌ఎక్స్‌ట్రా, భారతీ హెక్సాకామ్‌ ఈ మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది.  కాగా ఈ నెల 26న కంపెనీ అసాధారణ సమావేశాన్ని నిర్వహించనుంది. కంపెనీలో 1.28 శాతం వాటా కొనుగోలుకు గూగుల్‌ రూ.7,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు షేర్లను జారీ చేయడానికి సమావేశంలో అనుమతి కోరనుంది. మొబైల్‌ టవర్‌ కంపెనీ ఇండస్‌ టవర్స్‌ వ్యాపారంలో రూ.88,000 కోట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ఖర్చు చేయనుంది.

Updated Date - 2022-02-07T09:18:27+05:30 IST