నేడు బకాయిలు చెల్లించనున్న టెల్కోలు!

ABN , First Publish Date - 2020-02-17T07:01:20+05:30 IST

ఏజీఆర్‌ బకాయిలపై టెలికాం కంపెనీలు (టెల్కోలు) దారికొస్తున్నాయి. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, టాటా టెలిసర్వీసెస్‌ సోమవారం కొంత...

నేడు బకాయిలు చెల్లించనున్న టెల్కోలు!

  • ఎంత చెల్లిస్తారనే దానిపై సస్పెన్స్‌

న్యూఢిల్లీ: ఏజీఆర్‌ బకాయిలపై టెలికాం కంపెనీలు (టెల్కోలు) దారికొస్తున్నాయి. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌  ఐడియా, టాటా టెలిసర్వీసెస్‌ సోమవారం కొంత బకాయిలు చెల్లించే అవకాశం ఉందని సమాచారం. సుప్రీం కోర్టు ఆదేశం ప్రకారం ఈ కంపెనీలు టెలికాం శాఖ(డాట్‌)కు ఏజీఆర్‌ కింద రూ.1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఇందులో ఎంత మొత్తాన్ని ఈ కంపెనీలు సోమవారం చెల్లిస్తాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ నెల 20కల్లా ఏజీఆర్‌ బకాయిల కింద రూ.10,000 కోట్లు చెల్లించేందుకు ఎయిర్‌టెల్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆర్థిక కష్టాలు ఉన్నా తాము ఎంత చెల్లించాలనే విషయాన్ని లెక్కిస్తున్నట్టు వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. ఈ నెల 14న సుప్రీం కోర్టు ఆదేశంతో ఈ గడువు ఇక ఎంత మాత్రం పొడిగించే అవకాశంలేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు పుట్టెడు ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలని కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ బకాయిలు చెల్లించి వచ్చే నెల 17న ఆయా కంపెనీల ఎండీలు, డైరెక్టర్లు కోర్టులో స్వయంగా హాజరు కావాలని సుప్రీం కోర్టు ఈ నెల 14న ఆదేశించింది. దీంతో ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో టెల్కోలకు పాలు పోవడం లేదు. 

Updated Date - 2020-02-17T07:01:20+05:30 IST