ముందే మేల్కొంటే మంచిది
ABN , First Publish Date - 2020-07-17T11:36:33+05:30 IST
కరోనా లక్షణాలున్న వారు సకాలంలో మేల్కొని వైద్య సేవలు పొందితే మంచి ఫలితాలొస్తాయని గృహనిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ..
కొవిడ్ను సకాలంలోగుర్తిస్తే మంచి ఫలితాలు
గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్జైన్
కాకినాడ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): కరోనా లక్షణాలున్న వారు సకాలంలో మేల్కొని వైద్య సేవలు పొందితే మంచి ఫలితాలొస్తాయని గృహనిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్జైన్ అన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్, జేసీలు, వైద్యా ధికారులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులతో సమా వేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో వైద్య సేవలు పొందకపోవడం వల్ల అనర్థాలు జరుగుతున్నాయన్నారు.
లక్షణాలున్న వారు ఆందోళన చెందకుండా పరీక్షలు చేయించుకుని సరైన వైద్యం తీసుకోవాలన్నారు. బొమ్మూరు కొవిడ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) నిర్వహణ బాగుందని కితాబిచ్చారు. సమావేఽశంలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, డీఎంహెచ్వో డాక్టర్ మల్లిక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ రాఘవేంద్ర రావు, ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ బాబ్జి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ మణిరత్న కిశోర్, ఐఎంఏ ప్రెసిడెంట్ రవి, తదితరులు పాల్గొన్నారు.