కళాపూర్ణోదయం గ్రంథావిష్కరణ

ABN , First Publish Date - 2022-01-17T04:54:53+05:30 IST

స్థానిక లక్ష్మీపురం శ్రీత్యాగరాజ కళావేదికపై సంస్కృతి సంగీత నృత్య నాటక సంస్థ, వివేకా సర్వీస్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం మహాకవి పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయ గ్రంథావిష్కరణ సభ జరిగింది.

కళాపూర్ణోదయం గ్రంథావిష్కరణ
గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న సాహితీ వేత్తలు

గుంటూరు(సాంస్కృతికం), జనవరి16: స్థానిక లక్ష్మీపురం శ్రీత్యాగరాజ కళావేదికపై సంస్కృతి సంగీత నృత్య నాటక సంస్థ, వివేకా సర్వీస్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం మహాకవి పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయ గ్రంథావిష్కరణ సభ జరిగింది. సభకు అజోవిభో కంధాళ ఫౌండేషన్‌ అధ్యక్షులు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ అధ్యక్షత వహించారు. సభలో సాహితీ వేత్తలు కందుకూరి రామకృష్ణ, సూర్యనారాయణ, కందుకూరి సత్యసూర్యనారాయణమూర్తి, గరిమెళ్ళ సోమయాజులు శర్మ, కోట లక్ష్మీ నరసింహం, కోన రమణరావు, వివేకా సర్వీస్‌ సొసైటీ అధ్యక్షుడు అంబటి మురళీకృష్ణ, సంస్కృతి వ్యవస్థాపకులు సర్రాజు బాలచందర్‌, నేతి విశ్వేశ్వరరావు పాల్గొని గ్రంఽథాన్ని ఆవిష్కరించి అనంతరం కవి పండితులను ఘనంగా సత్కరించారు. 

 

Updated Date - 2022-01-17T04:54:53+05:30 IST