అఖిల ప్రియ బెయిల్ పిటీష‌న్‌పై కొనసాగుతున్న సందిగ్ధత

ABN , First Publish Date - 2021-01-19T15:43:32+05:30 IST

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్ పిటీషన్‌పై సందిగ్దత కొనసాగుతోంది.

అఖిల ప్రియ బెయిల్ పిటీష‌న్‌పై కొనసాగుతున్న సందిగ్ధత

హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్ పిటీషన్‌పై సందిగ్దత కొనసాగుతోంది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న అఖిల ప్రియ నాంపల్లి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది. కాగా మరో ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్ట్ ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది. మరోవైపు ఈ కేసులో ఏ-3గా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 21న విచారణ జరగనుంది.


బోయినపల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. ఆమె బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. అఖిల ప్రియపై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు పోలీసులు మెమో దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 395 డెకయిట్ (దోపిడీ) కేసు నమోదు చేశారు. జీవిత కాలం శిక్ష పడే కేసులు తమ పరిధిలోకి రావని సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. దీంతో నాంపల్లి కోర్టులో అఖిల ప్రియ తరుపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది.

Updated Date - 2021-01-19T15:43:32+05:30 IST