అఖిలప్రియ సోదరుడు జగత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు?

ABN , First Publish Date - 2021-01-14T21:36:28+05:30 IST

బోయినపల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. కిడ్నాప్ కేసులో..

అఖిలప్రియ సోదరుడు జగత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు?

హైదరాబాద్: బోయినపల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. అఖిలప్రాయ సోదరుడు జగత్ పాత్రపై పోలీసుల దర్యాప్తు ఫైనల్ దశకు చేరింది. కిడ్నాప్ వ్యవహారంలో జగత్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. జగత్ విఖ్యాత్ కారు డ్రైవర్ ఇచ్చిన కీలక సమాచారం మేరకు ఈ కేసులో జగత్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీ, కాల్ డేటా ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. 

 

ఇక ఇదే కేసులో అఖిలప్రియ మూడు రోజుల పోలీసుల కస్టడీ ముగిసింది. దీంతో ఆమెకు న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కస్టడీ ముగిసిన వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ వచ్చింది. దీంతో ఆమెను జడ్జి ఎదుట హాజరుపర్చారు. జడ్జి రిమాండ్ విధించడంతో అఖిలప్రియను చంచల్‌గూడ జైలుకు తరలించారు. 


Updated Date - 2021-01-14T21:36:28+05:30 IST