ఆర్టీసీ డిపో ఎదుట ఏబీవీపీ ధర్నా
ABN , First Publish Date - 2020-10-25T09:31:52+05:30 IST
డిగ్రీ పరీక్షలు రాసే గ్రామీణ విద్యార్థుల సౌకర్యార్థం బస్సు నడపాలని శనివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు.
తాడిపత్రిటౌన్, అక్టోబరు24: డిగ్రీ పరీక్షలు రాసే గ్రామీణ విద్యార్థుల సౌకర్యార్థం బస్సు నడపాలని శనివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా కన్వీనర్ అఖిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ బస్సు సౌకర్యం లేక గ్రామీణ విద్యార్థులు సమయానికి రాలేకపోతున్నారన్నారు. పలుమార్లు బస్సులు నడపాలని వినతిపత్రం ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదన్నారు. గతంలో మాదిరిగా స్టూడెంట్ బస్సుపాసులతో బస్సులు నడపాలని డిమాండ్చేశారు. కార్యక్రమంలో నాయకులు ఓంప్రకాష్, రాజకుళ్లాయప్ప, నరేష్, సుధీర్, వంశీ, అన్వర్, విద్యార్థులు పాల్గొన్నారు.