విష ఆహారం తిని అక్కా,తమ్ముడు మృతి
ABN , First Publish Date - 2022-01-11T02:18:07+05:30 IST
జిల్లాలోని మనోహరబాద్లో తీవ్ర విషాదం నెలకొంది. ఫుడ్
మెదక్: జిల్లాలోని మనోహరబాద్లో తీవ్ర విషాదం నెలకొంది. విష ఆహారం తిని అక్కా,తమ్ముడు మృతి చెందారు. వారం క్రితం తమ్ముడు, ఈ రోజు అక్క మృతి చెందారు. గత సంవత్సరం డిసెంబర్ 22న రాత్రి మనోహరబాద్ గ్రామానికి చెందిన పోతరాజు అనిత, తన ఇద్దరు పిల్లలు కిషోర్ (8 ), లక్ష్మిప్రియ (11)తో కలిసి ఇంట్లో చికెన్ వండుకొని తిని పడుకున్నారు. అయితే చికెన్ తిన్న రాత్రి నుంచి వాంతులు విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. డిసెంబర్ 27న తమ్ముడు కిషోర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇవాళ చికిత్స పొందుతూ లక్ష్మిప్రియ మృతి చెందింది. ఫుడ్ పాయిజన్తో మృతి చెందారని పోలీసులకు తల్లి అనిత ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసికుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.