రేపు అక్కురాడ పేపర్ మిల్లు బహిరంగ వేలం
ABN , First Publish Date - 2021-02-25T04:45:41+05:30 IST
అక్కురాడ బయోగ్రీన్ పేపర్ మిల్లును ఈనెల 26న (శుక్రవారం) బహిరంగ వేలం వేస్తున్నట్లు నరసన్నపేట వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కింజరాపు వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అక్కురాడ ఫ్యాక్టరీ వద్ద జలుమూరు తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల వద్ద నోటీసులు అంటించామన్నారు.
జలుమూరు, ఫిబ్రవరి 24: అక్కురాడ బయోగ్రీన్ పేపర్ మిల్లును ఈనెల 26న (శుక్రవారం) బహిరంగ వేలం వేస్తున్నట్లు నరసన్నపేట వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కింజరాపు వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అక్కురాడ ఫ్యాక్టరీ వద్ద జలుమూరు తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల వద్ద నోటీసులు అంటించామన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం తమ శాఖకు రూ.1.46 కోట్లు బకాయిపడి సకాలంలో చెల్లించనందున వారి అధీనంలో ఉన్న భూములు వేలం వేస్తున్నట్లు పేర్కొన్నారు.