కరోనా వారియర్స్‌ కోసం.. అక్షయపాత్ర రూ.22 కోట్లు సేకరణ

ABN , First Publish Date - 2020-12-01T07:46:39+05:30 IST

కరోనా వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు, వలస కార్మికులు, వారి కుటుంబాలను ఆదుకునేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్‌ అనే లాభాపేక్ష లేని సంస్థ 30 లక్షల డాలర్ల (రూ.22.20 కోట్లు) విరాళాలు సేకరించింది...

కరోనా వారియర్స్‌ కోసం.. అక్షయపాత్ర రూ.22 కోట్లు సేకరణ

హ్యూస్టన్‌, నవంబరు 30: కరోనా వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు, వలస కార్మికులు, వారి కుటుంబాలను ఆదుకునేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్‌ అనే లాభాపేక్ష లేని సంస్థ 30 లక్షల డాలర్ల (రూ.22.20 కోట్లు) విరాళాలు సేకరించింది. అక్షయపాత్ర 7వ, చివరి ‘గ్రాటిట్యూట్‌ గాలా’ అనే కార్యక్రమాన్ని ఈ నెల 21న వర్చువల్‌ విధానంలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌.. అక్షయపాత్ర సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా తాను రచించిన ‘భూక్‌’(ఆకలి) అనే కవితను ఆలపించారు. నిధుల సేకరణ కార్యక్రమంలో బాలీవుడ్‌ ప్రముఖులు హేమామాలిని, శంకర్‌ మహదేవన్‌ వంటి ప్రముఖులతో పాటు 10 వేల మందికి పైగా పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-01T07:46:39+05:30 IST