జగన్ ప్రభుత్వం సిగ్గుపడాలి: ఆలపాటి
ABN , First Publish Date - 2021-09-02T19:40:03+05:30 IST
జగన్ ప్రభుత్వం.. దమ్మాలపాటిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా సిగ్గుపడాలని టీడీపీ నేత ఆలపాటి రాజా అన్నారు.
అమరావతి: అహంకారపూరితంగా, నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వం.. దమ్మాలపాటిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా సిగ్గుపడాలని టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన కుటుంబసభ్యులపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేదానికి అర్థం లేదని సుప్రీం కోర్టు, హైకోర్టు చెప్పిందన్నారు. రాజధానిని తరలించాలనే ఉద్దేశంతో రైతుల త్యాగాన్ని కూడా ప్రభుత్వం గుర్తించలేదని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షం, కార్యకర్తలు, ప్రశ్నించేవారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై బురద జల్లడంలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారని, వ్యవస్థలపై గౌరవం లేకుండా ప్రతి అంశాన్ని వక్రీకరంచి ప్రభుత్వం విమర్శలు చేస్తోందని ఆలపాటి రాజా అన్నారు.