‘అలయ్ బలయ్’ సమానత్వాన్ని పెంచుతుంది
ABN , First Publish Date - 2021-10-17T09:44:11+05:30 IST
ప్రతి ఏటా దసరా అనంతరం బండారు దత్తాత్రేయ నిర్వహించే ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ప్రజల్లో ఐకమత్యం, సమానత్వాన్ని పెంచుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
బండారు దత్తాత్రేయకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఏటా దసరా అనంతరం బండారు దత్తాత్రేయ నిర్వహించే ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ప్రజల్లో ఐకమత్యం, సమానత్వాన్ని పెంచుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని శనివారం దత్తాత్రేయకు లేఖ రాశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా విజయ దశమి తర్వాత నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రజల్లో పండుగ వాతావరణాన్ని నింపుతుందని, అసాధారణ స్ఫూర్తిని చాటుతుందన్నారు.