మైలవరానికి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
ABN , First Publish Date - 2020-07-10T14:46:24+05:30 IST
విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరానికి అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని ఎస్సై ఈశ్వరరావు స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరానికి అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని ఎస్సై ఈశ్వరరావు స్వాధీనం చేసుకున్నారు. మైలవరంలోని, ఎల్బీఆర్సీఈ సమీపంలో 205 మద్యం బాటిళ్లు, రాజపేటలో, 200 మద్యం బాటిళ్లను సిబ్బంది స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి ఒక ఆటో, మూడు బైక్లను పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులు పారిపోగా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.