వస్తువులు ఎక్కడ తయారయ్యాయో ఈ-కామర్స్ సంస్థలు చెప్పాలి: కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2020-07-10T05:04:28+05:30 IST

ఈ కామర్స్ సంస్థల వెబ్‌సైట్లలో విక్రయానికి ఉంచిన వస్తువులు ఎక్కడ తయారయ్యాయనేది ఆయా సంస్థలు కచ్చితంగా చెప్పాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరోసారి స్పష్టం చేశారు.

వస్తువులు ఎక్కడ తయారయ్యాయో ఈ-కామర్స్ సంస్థలు చెప్పాలి: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థల వెబ్‌సైట్లలో విక్రయానికి ఉంచిన వస్తువులు ఎక్కడ తయారయ్యాయనేది ఆయా సంస్థలు కచ్చితంగా చెప్పాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో సంస్థలు నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు. ఇందుకు సంబంధించిన నిబంధన 2018 జనవరిలోనే అమల్లోకి వచ్చిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. చైనా ఉత్పత్తులకు చెక్ పెట్టాలనే డిమాండ్ భారత్‌లో ప్రస్తుతం ఊపందుకున్న నేపథ్యంలో పాశ్వాన్ చేసిన సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

Updated Date - 2020-07-10T05:04:28+05:30 IST