కంపెనీల రాబడికి 25శాతం గండి

ABN , First Publish Date - 2020-05-22T06:54:54+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో ఆదాయం 25 శాతానికి పైగా తగ్గిందని వివిధ కంపెనీల ఉన్నత స్థాయి మేనేజర్లు తెలిపారు. అంతేకాదు, వ్యాపారం మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఏడాదికి పైగా పట్టొచ్చట. ఆన్‌లైన్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రొవైడర్...

కంపెనీల రాబడికి 25శాతం గండి

లాక్‌డౌన్‌ సమయంలో ఆదాయం 25 శాతానికి పైగా తగ్గిందని వివిధ కంపెనీల ఉన్నత స్థాయి మేనేజర్లు తెలిపారు. అంతేకాదు, వ్యాపారం మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఏడాదికి పైగా పట్టొచ్చట. ఆన్‌లైన్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రొవైడర్‌ ‘స్ర్కిప్‌బాక్స్‌’ తాజా అధ్యయన నివేదిక ‘కొవిడ్‌-19 అండ్‌ యువర్‌ వెల్త్‌’ ఈ విషయాల్ని వెల్లడించింది. కంపెనీల ఆదాయంపై లాక్‌డౌన్‌ ప్రభావం, ఉద్యోగాల తొలగింపులు వంటి అంశాలపై సంస్థ అధ్యయనం జరిపింది. ఈనెల 1-15 తేదీల్లో దాదాపు 1,200 మంది కార్పొరేట్‌, ఎస్‌ఎంఈ, స్టార్టప్‌ ప్రతినిధుల నుంచి వివరాలు సేకరించింది. 


  1. రాబడి 25 శాతంపైగా పడిపోయిందని సర్వేలో పాల్గొన్న 67 శాతం మంది తెలిపారు. 
  2. వచ్చే ఏడాదికిగానీ వ్యాపారం మళ్లీ సాధారణ స్థితికి చేరుకోలేకపోవచ్చని అందరి అభిప్రాయం. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఏడాదికి పైగా సమయం పట్టొచ్చని 22 శాతం మంది అంచనా. 
  3. రాబడి తగ్గుదలతోపాటు ఉద్యోగాలకూ కోతపడింది. 25 శాతం లోపు ఉద్యోగాలకు కోతపడినట్లు 90 శాతం మంది వెల్లడించారు. మరో 10 శాతం మాత్రం 25 శాతానికి పైగా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందన్నారు. ఎస్‌ఎంఈ విభాగంలో ఉద్యోగాలపై అధిక ప్రభావం పడింది. 
  4. ఫ్రీలాన్సర్లపై లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపింది. ఈ సమయంలో తమ రాబడి 25 శాతం పైగా తగ్గిందని సర్వేలో పాల్గొన్న 66 శాతం మంది తెలిపారు. మరో 35 శాతం మంది మాత్రం ఆదాయం పూర్తిగా కుంటుపడిందన్నారు.

Updated Date - 2020-05-22T06:54:54+05:30 IST