అర్హులైన రైతులందరి ఖాతాల్లో జమ కావాలి
ABN , First Publish Date - 2021-06-18T05:06:27+05:30 IST
అర్హులైన ప్రతీ రైతు ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ కావాలని ఎమ్మెల్యే ఎస్ఆర్రెడ్డి అన్నారు.
- రైతుబంధు డబ్బులపై ఎమ్మెల్యే ఎస్ఆర్రెడ్డి
నారాయణపేటటౌన్, జూన్ 17 : అర్హులైన ప్రతీ రైతు ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ కావాలని ఎమ్మెల్యే ఎస్ఆర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను గురువారం లబ్ధిదారులకు అందించారు. కొందరు రైతులు తమ ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదని తన దృష్టికి తీసుకొచ్చారని ఎమ్మెల్యే అన్నారు. దామరగిద్ద మండలంలోని 194 మంది రైతుల సమస్యను పరిష్కరించాలని సూచిం చారు. కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గందె చంద్రకాంత్, రాజవర్దన్రెడ్డి, విజయ్, సుదర్శన్, గురు, ప్రతాప్రెడ్డి, రమేష్, శ్రీనివాస్, వి.రాములు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన డీఆర్డీఏ
నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ఆర్రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో ఇన్చార్జీ డీఆర్డీఏ గోపాల్ నాయక్ గురువారం మర్యాద పూర్వకంగా కలిసి బొకేను అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, హరితహారంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.