యూపీలో మే 20వరకు విద్యాసంస్థలన్నీ మూసివేత

ABN , First Publish Date - 2021-05-10T13:50:10+05:30 IST

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల 20వతేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కోచింగ్ సంస్థలను మూసివేస్తూ ....

యూపీలో మే 20వరకు విద్యాసంస్థలన్నీ మూసివేత

లక్నో (ఉత్తరప్రదేశ్): కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల 20వతేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కోచింగ్ సంస్థలను మూసివేస్తూ యూపీ సర్కారు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. యూపీలోని అన్ని విద్యాసంస్థల్లో ఆన్ లైన్ క్లాసులను కూడా రద్దు చేస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. మే 17వతేదీ వరకు రాత్రి కరోనా కర్ఫ్యూను పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఆంక్షల సందర్భంగా అత్యవసర సర్వీసులు, ఔషధ దుకాణాలు, కూరగాయలు, రేషన్ దుకాణాలు మాత్రమే తెరచి ఉంచవచ్చు.అన్ని వాణిజ్య దుకాణాలను మూసివేయాలని సర్కారు కోరింది. యూపీలో 23,333 తాజా కరోనా కేసులు నమోదైనాయి. కరోనా వల్ల 296 మంది మరణించారు.


Updated Date - 2021-05-10T13:50:10+05:30 IST