సీఎం జగన్కు లేఖ రాసిన ఆలిండియా లాయర్స్ అసోసియేషన్
ABN , First Publish Date - 2021-05-12T01:12:22+05:30 IST
రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరాపై సీఎం జగన్కు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ మంగళవారం లేఖ రాసింది.
అమరావతి : రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరాపై సీఎం జగన్కు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ మంగళవారం లేఖ రాసింది. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సరఫరా నిమిత్తమై సరైన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. చికిత్స నిమిత్తమై ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే వారిని ఎవరూ ఆపకుండా సీఎం తగు చర్యలు తీసుకోవాలని, 2024 వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి, సీఎం కేసీఆర్తో మాట్లాడాలని వారు డిమాండ్ చేశారు. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయిన ఘటనలో బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో రుయా ఘటన ఒక ఉదాహరణ మాత్రమేనని, ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయని లేఖలో పేర్కొన్నారు.