రైతు బిల్లుకు వ్యతిరేకంగా అఖిలపక్షం ర్యాలీ
ABN , First Publish Date - 2020-09-26T11:07:22+05:30 IST
కేంద్రం ప్రవేశపెట్టిన రైతుబిల్లుకు వ్యతిరేకంగా శుక్ర వారం అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ పుష్పలతకు వినతిపత్రం
జన్నారం, సెప్టెంబరు 25: కేంద్రం ప్రవేశపెట్టిన రైతుబిల్లుకు వ్యతిరేకంగా శుక్ర వారం అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ పుష్పలతకు వినతిపత్రం సమర్పించారు. అఖిలపక్షం నాయకులు అంగడిబజార్ నుంచి తెలం గాణ తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన రైతుబిల్లుతో రైతులకు ఒరిగింది ఏమిలేదని ఆరో పించారు. కేంద్రం రైతులకు న్యాయం చేయాల్సింది పోయి రైతుల నడ్డి విరుస్తోం దని విమర్శించారు. కాంగ్రెస్, సీపీఎం, టీడీపీ నాయకులు ప్రభుదాస్, పోతుల శంకర్, తాళ్లపల్లి రాజేశ్వర్, ముత్యం రాజన్న తదితరులు వున్నారు.