స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-08-15T06:08:05+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.

స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన ఒంగోలులోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌

నేడు జిల్లావ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు, సభలు

ఒంగోలులో పాల్గొననున్న ఇన్‌చార్జ్‌ మంత్రి విశ్వరూప్‌

పోలీస్‌ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు చేసిన యంత్రాంగం

ఒంగోలు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : స్వాతంత్య్ర దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.   కొవిడ్‌ తీవ్రత ఉన్నప్పటికీ తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూనే పెద్దఎత్తున జెండా ఆవిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కరోనా నేపథ్యంలో పాఠశాలలు జరగడం లేదు. అయినప్పటికీ ఉపాధ్యాయులు హాజరై విద్యా కమిటీల చైర్మన్ల చేత జెండా ఆవిష్కరణలు చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎప్పటిలాగా జిల్లా స్థాయి కార్యక్రమం  ఒంగోలులోని పోలీసు గ్రౌండ్స్‌లో జరగనుంది. ఆదివారం ఉదయం 9గంటలకు ఇన్‌చార్జ్‌ మంత్రి పినిపే విశ్వరూప్‌ జెండా ఆవిష్కరణ చేయనున్నారు.  75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లావ్యాప్తంగా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చొరవతో యంత్రాంగం ఆధ్వర్యంలో పెద్దఎత్తున రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు.   



Updated Date - 2021-08-15T06:08:05+05:30 IST