మంజూరైన అన్నీ ఇళ్లను నిర్మిస్తాం

ABN , First Publish Date - 2021-09-19T04:51:27+05:30 IST

సర్వేపల్లి నియోజకవర్గంలోని పేదలకు మంజూరైన అన్ని ఇళ్లను పూర్తిగా నిర్మిస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు.

మంజూరైన అన్నీ ఇళ్లను నిర్మిస్తాం
నూతనంగా నిర్మిస్తున్న ఇళ్లను పరిశిలిస్తున్న ఎమ్మెల్యే కాకాణి

 సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

వెంకటాచలం, సెప్టెంబరు 18 : సర్వేపల్లి నియోజకవర్గంలోని పేదలకు మంజూరైన  అన్ని ఇళ్లను పూర్తిగా నిర్మిస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు.  మండలంలోని సరస్వతి నగర్‌ వద్ద ఉన్న జగనన్న కాలనీలో నిర్మిస్తున్న ఇళ్లను శనివారం కాకాణి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు అందించారన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు నోరు పారేసుకోవడం సరికాదన్నారు.  చంద్రబాబు ప్రోద్బలంతోనే అయ్యన్న పిచ్చి ప్రేలాపనలు చేశాడని విమర్శించారు.  టీడీపీ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.  కార్యక్రమంలో వైసీపీ నాయకులు మందల వెంకటశేషయ్య, కనుపూరు కోదండరామిరెడ్డి, కుడితిపూడి మురళీనాయుడు, చికూర్తి నరసయ్య, వెలుబోయిన వెంకటేశ్వర్లు, కడివేటి శివ, తాటిపర్తి సురేష్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-09-19T04:51:27+05:30 IST