టీడీపీ నేతలంతా బోస్డీకేలు: మంత్రి గుమ్మనూరు జయరాం
ABN , First Publish Date - 2021-10-23T08:59:25+05:30 IST
టీడీపీ నేతలంతా బోస్డీకేలని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో జనాగ్రహ దీక్ష ర్యాలీని నిర్వహించారు.
ఆలూరు, అక్టోబరు 22: టీడీపీ నేతలంతా బోస్డీకేలని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో జనాగ్రహ దీక్ష ర్యాలీని నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్ని అసభ్య పదజాలంతో దూషిస్తే సహించబోమన్నారు. సీఎం అనే గౌరవం లేకుండా బ్రాహ్మణ కులంలో పుట్టిన పట్టాభి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారంటూ మండిపడ్డారు. వాల్మీకి కులంలో పుట్టిన తాను వారి కంటే ఎక్కువగా తిట్టగలనన్నారు. టీడీపీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.