ఉపాధ్యాయులందరికీ టీకా వేయాలి
ABN , First Publish Date - 2021-05-17T04:24:03+05:30 IST
ఉపాధ్యాయులందరికీ టీకా వేయాలి
గుజరాతీపేట: ఉపాధ్యాయులందరికీ కరోనా టీకా వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.చలపతిరావు, ఎస్.నర్సింగ రావు డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశం (వర్చువల్)లో వారు మాట్లాడారు. వయసుతో సంబంధం లేకుండా ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్ వేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు సీహెచ్ శ్రావణకుమార్, ఎస్.బాలాజీ, ఆపస్ ప్రభారి కె.లింగరాజు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఫ కరోనా బారినపడిన ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మజ్జి చిన్నబా బు, తమ్మినేని చందనరావు, రాష్ట్ర కార్యదర్శి కణితి తేజేశ్వర రావులు కోరారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.