మల్యాలలో ముగిసిన ఎల్లమ్మ పట్నాలు
ABN , First Publish Date - 2021-02-25T05:10:44+05:30 IST
మ ల్యాల గౌడ సంఘం ఆద్వ ర్యంలో వారం రోజులుగా జరుగుతున్న ఎల్లమ్మ పట్నా లు బుధవారంతో ముగిశా యి.
- పాల్గొన్న ఎమ్మెల్యే రవిశంకర్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
మల్యాల, ఫిబ్రవరి 24: మ ల్యాల గౌడ సంఘం ఆద్వ ర్యంలో వారం రోజులుగా జరుగుతున్న ఎల్లమ్మ పట్నా లు బుధవారంతో ముగిశా యి. ఎమ్మెల్సీ టీ.జీవన్రెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశంగౌడ్, టీపీ సీసీ అధికా ర ప్రతినిధి మేడిపెల్లి సత్యం దర్శించుకున్నారు. జడ్పీటీసీ రాంమోహన్ రావు, ఎంపీపీ విమల, సర్పంచ్ సుదర్శన్, మార్కెట్ కమిటీ చైర్మన్ జనగాం శ్రీనివాస్, దారం ఆదిరెడ్డి, వీరబత్తిని శోభరాణీ, బత్తిని శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కాగా ఈ వేడుక లతో మల్యాలలో రహదారులన్నీ రద్దీగా మారాయి.
అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే..
కొండగట్టు ఆంజనేయస్వామిని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దర్శించుకున్నారు. అనంతరం గురువారం కొండగట్టు దర్శనంకు రానున్న ఎమ్మెల్సీ కవిత పర్య టనపై ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. జడ్పీటీసీ రాంమోహన్రావు ఉన్నారు.