ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ అందాలి
ABN , First Publish Date - 2021-01-17T06:49:47+05:30 IST
రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ అందేవిఽధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుం టుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూ ప్ పేర్కొన్నారు.
మంత్రి విశ్వరూప్
అమలాపురంటౌన్, జనవరి 16: రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ అందేవిఽధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుం టుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూ ప్ పేర్కొన్నారు. శనివారం అమలాపురం ఏరియా ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ చలువతో రాష్ట్రంలో తొలివిడత వాక్సినే షన్ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ను లేనివిధంగా ఏపీలో రికార్డు స్థాయిలో కోటికిపైగా కొవిడ్ పరీక్షలు నిర్వహించామన్నారు. అమలాపురం సబ్కలెక్టర్ హిమాన్షుకౌశిక్ మాట్లాడుతూ డివిజన్లో మొదటివిడత వ్యాక్సి నేషన్లో తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొదటి విడతగా ఫ్రంట్లైన్ వారియర్స్కు కొవిడ్ వ్యాక్సిన్ అందజే స్తామని తెలిపారు. రెండో విడతలో అడ్మి నిస్ర్టేషన్, రెవెన్యూ, పోలీసు, ఇతర సిబ్బందికి వ్యాక్సిన్ అందిం చి మూడోవిడతలో సామాన్య ప్రజలకు వ్యాక్సిన్ వేస్తామని వివరించారు. కార్యక్ర మంలో జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్వీవీ సత్యనారాయణ, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా క్టర్ సీహెచ్ పుష్కరరావు, సూపరింటెండెంట్ డాక్టర్ కె.ప్రభా కర్, ఆర్ఎంవో వీఆర్కే మూర్తి, డాక్టర్ ప్రసాదరావు, కమీషనర్ వి.అయ్యప్పనాయుడు, నాయకులు గనిశెట్టి రమణలాల్, వెంకన్నాయుడు, రామకృష్ణ పాల్గొన్నారు.