పార్టీ పటిష్టతకు యువత సైనికుల్లా పనిచేయాలి
ABN , First Publish Date - 2021-06-14T03:52:34+05:30 IST
భారతీయ జనతా పార్టీ పటిష్టానికి యువత సైనికుల్లా పనిచేయాలని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రాళ్ళబండి మహేందర్ అన్నారు. ఆదివారం బీజేవైఎం కమిటీల పర్యవేక్షణకు జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనను శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి యువమోర్చా ముందుండాలన్నారు.
ఏసీసీ, జూన్ 13 : భారతీయ జనతా పార్టీ పటిష్టానికి యువత సైనికుల్లా పనిచేయాలని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రాళ్ళబండి మహేందర్ అన్నారు. ఆదివారం బీజేవైఎం కమిటీల పర్యవేక్షణకు జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనను శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి యువమోర్చా ముందుండాలన్నారు. రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాలో బీజేవైఎం మండల కమిటీల నియామకం పూర్తి చేసుకొని ముందుందన్నారు. మోదీ సంక్షేమ పథకాలు గడపగడపకు తీసుకెళ్ళే బాఽధ్యత యువమోర్చదేనని తెలిపారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటకృష్ణ, ఆంజనేయులు, రాజు, దేవేందర్, రాచకొండ సత్యనారాయణ, జాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.