పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: ఆళ్లనాని

ABN , First Publish Date - 2020-10-21T15:32:42+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీసుల అమరవీరుల దినోత్సవం జరిగింది.

పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: ఆళ్లనాని

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీసుల అమరవీరుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆళ్ల నాని పాల్గొని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేశామని ఆయన పేర్కొన్నారు. మహిళల కోసం దిశ పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు చేశారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆళ్ల నాని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 87రకాల సేవలతో పోలీస్ సేవా యాప్ తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో నేరాలు సంఖ్య 18 శాతం తగ్గిందన్నారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకూ వీక్లీ ఆఫ్‌ను ప్రప్రథమంగా అమలు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

Updated Date - 2020-10-21T15:32:42+05:30 IST