అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలి
ABN , First Publish Date - 2021-06-14T04:57:22+05:30 IST
మండలంలో అర్హులైన పేదలను డబుల్బెడ్రూం ఇళ్లు వెంటనే కేటాయించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం స్థానిక డబుల్బెడ్రూం గృహాల కాలనీలో ధర్నా నిర్వహించారు.
ఉట్నూర్, జూన్ 13: మండలంలో అర్హులైన పేదలను డబుల్బెడ్రూం ఇళ్లు వెంటనే కేటాయించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం స్థానిక డబుల్బెడ్రూం గృహాల కాలనీలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రాథోడ్ చారులత, సీపతి లింగాగౌడ్ మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న పేదలు డబుల్బెడ్రూంల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు పేదలు ఉండడానికి సరిపోవడం లేదని పేర్కొంటూ నిర్మించిన డబుల్బెడ్రూం ఇళ్లు ప్రారంభానికి ముందే కూలిపోయే దిశగా చేరుతున్నాయని విమర్శించారు. నిర్మాణం పూర్తయి రెండేళ్లు కావస్తున్నా స్థానిక ఎమ్మెల్యే, నాయకులు అర్హులకు ఇళ్లు కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. నెలలోగా కేటాయించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అర్హులను ఎంపిక చేసి గృహాల్లోకి పంపిస్తాం అని అన్నారు.