పాలిసెట్‌ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు

ABN , First Publish Date - 2020-09-24T08:44:16+05:30 IST

పాలిసెట్‌-2020 లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రై వేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో చేరుటకు

పాలిసెట్‌ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు

నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 23: పాలిసెట్‌-2020 లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రై వేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో చేరుటకు సీట్లను కేటాయించినట్లు నిజామాబాద్‌ బాలుర పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీరాంకుమార్‌ బుధవా రం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ సీటుకు సంబంధించిన వివరాలను టీఎస్‌పాలిసెట్‌.ఎన్‌ఐసీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో క్యాండేట్‌ లాగిన్‌తో పొందవచ్చని, సీట్లు పొందిన వి ద్యార్థులు ఈనెల 23 నుంచి 26 వరకు సం బంధిత ట్యూ షన్‌ ఫీజు చెల్లించి సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని పేర్కొన్నా రు. అక్టోబరు 5, 6 తేదీల్లో విద్యార్థులకు తమకు కేటాయించిన కళాశాలకు వెళ్లి సంబంధిత పత్రాలతో రిపోర్టు  చే యాలని, సీటు పొందని అభ్యర్థులు ఈనెల 30, అక్టోబరు 1వ తేదీన ఆప్షన్స్‌ నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 

Updated Date - 2020-09-24T08:44:16+05:30 IST