తుళ్లూరులో భారీ ర్యాలీ

ABN , First Publish Date - 2020-02-22T21:01:46+05:30 IST

పోలీసులు తీరును నిరసిస్తూ తుళ్లూరులో మహిళలు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినా... అమరావతిని కొనసాగించే వరకూ పోరాటం ఆగదని మహిళలు, రైతులు హెచ్చిరించారు.

తుళ్లూరులో భారీ ర్యాలీ

అమరావతి: పోలీసులు తీరును నిరసిస్తూ తుళ్లూరులో మహిళలు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినా... అమరావతిని కొనసాగించే వరకూ పోరాటం ఆగదని మహిళలు, రైతులు హెచ్చిరించారు. రైతులు, రైతుకూలీలు, మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేయటంతో పాటు, అక్రమ కేసులు బనాయించారని, ఈ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ అమరావతిలోని 29 గ్రామాల్లో జేఏసీ నేతలు శనివారం బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. విద్య, వ్యాపార సంస్థలు బంద్‌‌లో పాల్గొన్నాయి.  

Updated Date - 2020-02-22T21:01:46+05:30 IST