అమరావతి: హైకోర్టుకు వెళ్లే మార్గంలో రాజధాని రైతుల మానవహారం

ABN , First Publish Date - 2020-08-04T16:53:15+05:30 IST

అమరావతి: హైకోర్టుకు వెళ్లే మార్గంలో రాజధాని రైతుల మానవహారం

అమరావతి: హైకోర్టుకు వెళ్లే మార్గంలో రాజధాని రైతుల మానవహారం

అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ ఆమోదం తెలపడంతో  రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్ట్‌ను ఆశ్రయించింది. దీనిపై నేడు కోర్టులో విచారణ ఉండడం‌తో సీడ్ ఆక్సిస్ రోడ్‌పై  రైతులు, రైతు కూలీలు ఇరువైపులా నిలచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు అమరావతిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. వెంకటపాలెం, ఉద్దండరాయని పాలెం, తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి, లింగాయపాలెం, రాయపూడి, తుళ్ళూరుకు చెందిన రైతులు రైతు కూలీలు రోడ్‌కు ఇరువైపులా నిలిచారు. నిన్న శిబిరాల్లో హైకోర్టుకు  తుళ్ళూరు మహిళ రైతులు ప్రత్యేక పూజలు చేశారు. హైకోర్టుకు వెళ్లే మార్గం మొత్తం రైతులు మానవహారంగా ఉన్నారు. 

Updated Date - 2020-08-04T16:53:15+05:30 IST