నేటి నుంచి హైకోర్టులో అమరావతి రైతుల పిటిషన్లపై విచారణ
ABN , First Publish Date - 2020-09-21T13:03:01+05:30 IST
నేటి నుండి హైకోర్టులో అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి,మాజీ ఎంఎల్ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగనుంది.
అమరావతి: నేటి నుండి హైకోర్టులో అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి,మాజీ ఎంఎల్ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగనుంది. నేడు ధర్మాసనం ముందు లిస్ట్ అయిన 93 పిటిషన్లు రానున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, జీఎన్రావు కమిటీ, హై పవర్ కమిటీల చట్టబద్దతపై రాజధాని రైతులు కేసులు వేశారు. సీర్డీఏ రైతులతో చేసుకున్న ఒప్పంద ఉల్లంగానపై కేసులు నమోదు అయ్యాయి. రాజధానిలో మాస్టర్ ప్లాన్ డివియేషన్పైన, మౌలిక సదుపాయాల కల్పన చేయకపోవడం పైన రైతులు కేసులు వేశారు. అలాగే రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144 సీఆర్పీసీ విధింపును రైతులు ఛాలెంజ్ చేశారు. కాగా పరిపాలన రాజధాని తరలింపు కోసం చేసిన చట్టం పై ఇప్పటికే హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన విషయం తెలిసిందే. నేడు ఆన్లైన్ ద్వారా రాజధానికి సంబంధించిన కేసులను ధర్మాసనం విచారించనుంది.